Nimmagadda Ramesh Kumar: ఈ నెల 31తో నా పదవీ కాలం పూర్తవుతుంది.. ఇక‌ ఎన్నికలను నిర్వ‌హించ‌లేను: నిమ్మ‌గ‌డ్డ‌

cant conduct eletion says nimmagadda

  • కొత్త అధికారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వ‌హిస్తారు
  • ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చు
  • హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ ఆదేశాలిస్తున్నాం 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించాల్సిన‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా రాష్ట్ర‌ ఎన్నికల కమిషనర్ నిమ్మ‌గ‌డ్డ ప్రసాద్ పూర్తి చేస్తారా? అన్న సందిగ్ధ‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆయ‌న ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. దీంతో ఆ బాధ్యతలను కొత్తగా వచ్చే ఎన్నికల అధికారి నిర్వహిస్తారని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎన్నికల షెడ్యూలును విడుదల చేయలేనని తెలిపారు. అయితే, ఆ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చ‌ని సూచించారు. బెదిరింపుల వ‌ల్ల‌ నామినేషన్లను దాఖ‌లు చేయ‌లేక‌పోయిన వారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వివ‌రించారు.

హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ ఆదేశాలిస్తున్నామని తెలిపారు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్రదేశ్‌లో ముగిసిన గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల‌తో పాటు ప్రభుత్వ యంత్రాంగం స‌మ‌ర్థంగా ప‌నిచేసింద‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాల‌తో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జ‌రుగుతోన్న‌ ఎన్నికల్లో పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సిన్లు వేసే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించిన‌ట్లు చెప్పారు.

Nimmagadda Ramesh Kumar
Andhra Pradesh
State Election Commission
  • Loading...

More Telugu News