amani: అప్పట్లో ఎక్స్‌పోజింగ్ గురించి అడిగితే సౌంద‌ర్య అలా స‌మాధానం ఇచ్చింది: ఆమ‌ని

amani tells interesting thing about soundarya

  • ఓ సారి సౌంద‌ర్య‌తో షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు అడిగాను
  • ఎక్స్ పోజ్ ఎందుకు చేయాలని తిరిగి తను ప్రశ్నించింది 
  • కుటుంబ సభ్యుల ముందు ఇబ్బందులు ప‌డ‌తామ‌ని చెప్పింది

సినీ రంగంలో గ్లామ‌ర్ కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తారు. ముఖ్యంగా హీరోయిన్లను అందానికి ప్ర‌తిరూపాలుగా చూపెడుతుంటారు. మరీ ముఖ్యంగా ఎక్స్‌పోజింగ్ చేయడానికి రెడీగా వుండే హీరోయిన్లకు అవ‌కాశాలు బాగా వస్తాయనే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అటువంటి రంగుల ప్ర‌పంచంలో నిన్న‌టి త‌రం హీరోయిన్, దివంగ‌త సౌంద‌ర్య ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా కేవ‌లం త‌న న‌ట‌న‌, అందంతో అగ్ర హీరోయిన్‌గా నిలిచింది. ప్ర‌తి తెలుగువారి మ‌దిలో ఆమె నిలిచిపోయింది.

ఆమె హీరోయిన్‌గా చేస్తోన్న స‌మ‌యంలో మ‌రోవైపు ఆమ‌ని కూడా సినిమాల్లో సంప్ర‌దాయబ‌ద్ధంగా చీర‌క‌ట్టుతో క‌న‌ప‌డుతూ అల‌రించేది. తాజాగా, ఆమ‌ని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. సౌంద‌ర్య ఎందుకు ఎక్స్‌పోజింగ్ చేయలేద‌న్న విష‌యాన్ని గురించి ప‌లు విష‌యాలు తెలిపింది.  

ఓ సారి తాను సౌంద‌ర్య‌తో షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో ఆమెను ఎక్స్‌పోజింగ్ గురించి అడిగానని ఆమ‌ని చెప్పింది. అప్పుడు సౌంద‌ర్య స్పందిస్తూ, ఎక్స్‌పోజ్ ఎందుకు చేయాలని తిరిగి ప్రశ్నించింద‌ని, రేపు పెళ్లయ్యాక భర్త పక్కన ఉన్నప్పుడు మన సినిమాలు చూస్తుంటే, అలాంటి సీన్లు వస్తే కనుక ఎలా ఫీలవుతామని అడిగింది. అలాగే, మ‌న కుటుంబ సభ్యులకు ఆ సీన్లు ఎలా అనిపిస్తాయ‌ని సౌంద‌ర్య ప్రశ్నించిందని ఆమని గుర్తుచేసుకుంది.

ఇప్పుడు డబ్బుల కోసం ఇలాగే ఎక్స్‌పోజింగ్ చేస్తే, రేపు కుటుంబ స‌భ్యుల ముందు ఇబ్బందులు ప‌డతామ‌ని సౌందర్య వివరించినట్టు ఆమని పేర్కొంది. ఇదిలావుంచితే, జ‌గ‌ప‌తిబాబుతో శుభలగ్నం, మావిడాకులు వంటి సినిమాల‌తో పాటు ప‌లు హిట్ సినిమాల్లో న‌టించిన ఆమ‌ని ఇప్పుడు త‌ల్లి పాత్ర‌ల్లోనూ న‌టిస్తోంది. కొత్త సినిమా 'చావు కబురు చల్లగా'లో కీలక పాత్రలో నటించింది.

  • Loading...

More Telugu News