రోహిత్ శర్మను ఎలా పొగడాలి?: సునీల్ గవాస్కర్!
- తొలి టెస్టులో కోహ్లీ విఫలమైన వేళ రాణించిన రోహిత్
- 161 పరుగులు చేసిన హిట్ మ్యాన్
- ముందే ఆ కసిని చూశానన్న సునీల్ గవాస్కర్
భారత జట్టు 300 పరుగులు సాధిస్తే, అతనొక్కడే 161 పరుగులు చేశాడని గుర్తు చేశారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధిస్తే, అందుకు రోహిత్ తొలి ఇన్నింగ్స్ కూడా ఓ కారణం అవుతుందని అన్నారు. కాగా, ఈ మ్యాచ్ నేడు రెండో రోజు కొనసాగనుండగా, రిపబ్ పంత్, అక్సర్ పటేల్ ఇన్నింగ్స్ ను కొనసాగించనున్నారు. ఇప్పటికే భారత జట్టు 6 వికెట్లను కోల్పోగా, ఈ జంట నేడు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులను సాధిస్తే, భారత జట్టు పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి.