మిషన్ బిల్డ్ ఏపీ కేసు.. ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
- మిషన్ బిల్డ్ ఏపీ కేసులో ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కేసులకు ఆదేశించిన హైకోర్టు
- హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం
హైకోర్టు జస్టిస్ రాకేశ్ కుమార్ డిసెంబర్ 30న తీర్పును వెలువరించి, డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. తన తీర్పులో ముఖ్యమంత్రి జగన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ఉన్న కేసుల వివరాలను తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాసిన తర్వాత... రాష్ట్రంలోని అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ తీర్పు ఇరు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించింది.