ఒంగోలులో బీటెక్ విద్యార్థిని కాలేజి ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకుందన్న వార్త కలచివేసింది: చంద్రబాబు
- ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థిని బలవన్మరణం
- విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
- అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యలు
- ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైందంటూ ఆగ్రహం
ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. వెంటనే విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.