టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే బీజేపీ నేతలు బయట తిరగలేరు: కేటీఆర్
- పరకాల ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి
- తీవ్రంగా ఖండించిన కేటీఆర్
- తమ సహనానికీ ఓ హద్దు ఉంటుందని వెల్లడి
- బీజేపీ దాడులను ఎదుర్కొనే సత్తా తమకుందని స్పష్టీకరణ
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానంలేదని, ప్రజాస్వామ్యంలో తమ వాదనలతో ప్రజలను మెప్పించడం చేతకాక ఇతర పార్టీలపై భౌతికదాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. భౌతికదాడులు చేస్తూ తమ వాదనలు వినిపించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని అన్నారు.