Nimmagadda Ramesh Kumar: ఎస్ఈసీ నిమ్మగడ్డకు గవర్నర్ అపాయింట్ మెంట్!

Nimmagadda Meeting with Governor Today

  • ఈ ఉదయం 10 గంటల తరువాత భేటీ
  • ఎన్నికల ఏర్పాట్లపై వివరించనున్న నిమ్మగడ్డ
  • క్రమశిక్షణా చర్యలపైనా వివరణ

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ కానున్నారు. తనకు అపాయింట్ మెంట్ కావాలని నిమ్మగడ్డ సమాచారం పంపగానే, ఈ ఉదయం 10.15 గంటలకు రావాలని గవర్నర్ సూచించారు.

కాగా, ఈ భేటీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఎలక్షన్ కమిషన్ తరఫున తీసుకుంటున్న చర్యలపై ఎస్ఈసీ వివరణ ఇవ్వనున్నారు. ఆపై అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణా చర్యల గురించి కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ వివరిస్తారని తెలుస్తోంది.

Nimmagadda Ramesh Kumar
Biswabhusan Harichandan
Andhra Pradesh
Appointment
  • Loading...

More Telugu News