నేతాజీ గొప్ప హిందూవాది.. అయినా అన్ని మతాలనూ గౌరవించారు: నేతాజీ కూతురు
- అనుచరులు, సైన్యానికి ఎంతో స్ఫూర్తినిచ్చేవారన్న అనిత
- ఆధునిక, ఆనంద భారత్ కోసం కలలుగన్నారని వెల్లడి
- అందరూ ఆయన సిద్ధాంతాలను పాటించాలని పిలుపు
ఐక్యతా, సహనం అనే సిద్ధాంతాలనే ఆయన జీవితాంతం అనుసరించారని అనిత గుర్తు చేశారు. ఆలోచనకు, అమలుకు ఆయన ప్రతిరూపం అన్నారు. నేతాజీ ఎప్పుడూ ఆధునిక, ఆనంద భారత్ కోసమే కలలు కనేవారన్నారు. అంతేగాకుండా చరిత్రలో వేళ్లూనుకుపోయిన సంస్కృతి, సిద్ధాంతాలు, మత సంప్రదాయాలనూ పాటించే ఇండియా కావాలనుకున్నారని చెప్పారు. నేతాజీ ఆలోచనలు, సిద్ధాంతాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.