ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగేలా చేశారు: టీమిండియాకు అమితాబ్ అభినందనలు
- డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు
- అద్భుతంగా ఆడిన విహారి, అశ్విన్
- పొగడ్తల జల్లు కురిపించిన బిగ్ బి
- అత్యంత కష్టసాధ్యమైన స్థితిలో పోరాడారని కితాబు
దీనిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. అత్యంత కష్టసాధ్యమైన పరిస్థితుల్లో మ్యాచ్ ను డ్రాగా ముగించారని అభినందించారు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత ప్రదర్శన చేశారని కితాబునిచ్చారు. గాయాల బెడద, జాత్యహంకార దూషణల పర్వం కలిగించిన విసుగు నుంచి ఉపశమనం కలిగిస్తూ మ్యాచ్ ను సురక్షితంగా ముగించారని అమితాబ్ కొనియాడారు. 'టీమిండియా... నువ్వు అత్యంత దృఢవైఖరి కనబర్చావు... ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశావు' అంటూ ఆయన ట్వీట్ చేశారు.