రేపు రామతీర్థం వెళ్లాలని ఏపీ మంత్రుల నిర్ణయం
- ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన రామతీర్థం
- ఇవాళ రామతీర్థంలో వాడీవేడి వాతావరణం
- మంత్రులపై విపక్షాల విమర్శలు
- రేపు ఉదయం 10 గంటల తర్వాత బొత్స, వెల్లంపల్లి పయనం
- సంఘటన స్థలం పరిశీలించనున్న మంత్రులు
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం రామతీర్థంలో బోడికొండపై ఉన్న రామస్వామి ఆలయానికి వెళ్లి అక్కడి ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రే మంత్రి వెల్లంపల్లి విశాఖ బయల్దేరారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత ఆయన రామతీర్థం వెళతారు. బొత్స కూడా అదే సమయంలో విజయనగరం నుంచి రామతీర్థంకి వెళతారు.