రాజాసింగ్ కు ఏపీ వైసీపీ నేత సవాల్!
- మల్లికార్జున స్వామిని ఏ మతం వారైనా పూజించొచ్చు
- దేవస్థానంలో నా పేరు మీద ఒక్క పని కూడా చేయలేదు
- ఆరోపించే ముందు ఒకసారి ఆలోచించాలి
శ్రీశైల మల్లికార్జునస్వామిని ఏ మతం వారైనా పూజించవచ్చని రజాక్ అన్నారు. ఇతర మతస్తులు పూజించకూడదని హిందూ మత గ్రంథంలో రాశారా? అని ప్రశ్నించారు. తన పేరు మీద శ్రీశైలం దేవస్థానంలో ఒక పని కూడా చేయలేదని చెప్పారు. ఇతర ముస్లింలకు కూడా దేవస్థానంలో ఎలాంటి కాంట్రాక్టులు ఇప్పించలేదని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని... ఆరోపించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించాల్సి ఉంది.