ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్... సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా నీలం సాహ్నీ
- సీఎస్ గా ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న నీలం సాహ్నీ
- సాహ్నీ స్థానంలో ఆదిత్యనాథ్ దాస్ కు బాధ్యతలు
- సాహ్నీకి సముచితం స్థానం కల్పించాలని జగన్ సర్కారు నిర్ణయం
- క్యాబినెట్ మంత్రి హోదాతో ముఖ్య సలహాదారు పదవి
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ
అటు, సీఎస్ పదవి నుంచి తప్పుకోనున్న నీలం సాహ్నీకి జగన్ సర్కారు సముచిత స్థానం కల్పించింది. ఆమెను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్య సలహాదారుగా ఆమెకు క్యాబినెట్ మంత్రి హోదా కల్పించనున్నారు. తన నూతన బాధ్యతల్లో భాగంగా నీలం సాహ్నీ ఆరోగ్యం, కొవిడ్ మేనేజ్ మెంట్, రాష్ట్ర-కేంద్ర సంబంధాలు, విభజన అంశాలు, పాలనా పరమైన సంస్కరణలు వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.