సముద్రం కంటే అవంతి చేసిన కబ్జాలే ఎక్కువ: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన
- విశాఖలో కబ్జాలు చేసేది వైసీపీ నేతలేనన్న మంతెన
- అవంతి, విజయసాయి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
- తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారని వెల్లడి
- కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు
"వైసీపీ సర్కారు విశాఖలో టీడీపీ నేతల ఆస్తుల్ని లాగేసుకుంటూ వారిపైనే కేసులు నమోదు చేస్తోంది. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? అన్ని అనుమతులు ఉన్నా గానీ మాజీ ఎంపీ సబ్బం హరి ప్రహరీగోడ కూల్చేశారు. గీతం యూనివర్సిటీలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. ఫ్యూజన్ హోటల్ కు కాలపరిమితి ఉన్నా అర్ధరాత్రి ఖాళీ చేయించారు" అని వివరించారు. వైసీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఇప్పుడు వేధింపులకు తెరలేపారని మంతెన ఆరోపించారు.