ఫార్మాసిటీ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానించిన కేసీఆర్
- హైదరాబాద్ శివారులో 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ
- లక్షలాది మందికి ఉపాధి
- ఫార్మాసిటీలో కేంద్రం భాగస్వామ్యం అవసరమన్న కేసీఆర్
- పీవీకి భారతరత్న ప్రకటించాలని అభ్యర్థన
ప్రపంచానికి అవసరమైన టీకాల్లో మూడోవంతు హైదరాబాద్లోనే తయారవుతున్నాయని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లు కూడా ఇక్కడే తయారవుతుండడం దేశానికే గర్వకారణమన్నారు. మొత్తం 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మించనుండగా, 11 వేల ఎకరాలు ఇప్పటికే అందుబాటులో ఉందని, మిగతా భూమిని సేకరిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఇప్పటికే వెయ్యికిపైగా పరిశ్రమలు భూముల కోసం అభ్యర్థనలు పంపినట్టు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే, దేశానికి ఎంతో సేవ చేసిన, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఈ సందర్భంగా మోదీని కోరారు.