KCR: ఈ నెల 7న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

  • తెలంగాణలో మరోసారి రైతు బంధు నిధుల విడుదలకు ఏర్పాట్లు
  • అధికారులతో చర్చించనున్న సీఎం కేసీఆర్
  • ట్వీట్ చేసిన తెలంగాణ సీఎంవో
CM KCR to meet higher officials on Monday

తెలంగాణలో మరోసారి రైతు బంధు నిధుల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఈ నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ ఏడాది రెండో విడత రైతు బంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది.

More Telugu News