నందికొట్కూరు వైసీపీలో విభేదాలు.. బైరెడ్డి ఆగ్రహం
- నియోజకవర్గంలో ముదురుతున్న వర్గ పోరు
- ఆర్థర్, బైరెడ్డి మధ్య విభేదాలు
- నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్న బైరెడ్డి
ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని అన్నారు. మధ్యలో వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. వీరివల్ల అసలైన కార్యకర్తలు నష్టపోతున్నారని చెప్పారు. ఇద్దరు, ముగ్గురు శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. జిల్లాలో పెద్ద నాయకులం అనుకునేవారు పద్ధతి మార్చుకోవాలని... తమ నియోజకవర్గంలో వేలు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.