ఒకే సామాజిక వర్గానికి 870 పోస్టులా?: పంచుమర్తి అనురాధ
- జగన్ పాలనలో సంక్షేమం చచ్చిపోయింది
- ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది
- వైసీపీ పాలనలో 600కు పైగా అత్యాచారాలు జరిగాయి
పేదల కన్నీళ్లు తుడిచామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని... దళితులకు శిరోముండనం చేయడమేనా కన్నీళ్లు తుడవడమంటే? అని ప్రశ్నించారు. 17 నెలల కాలంలో రాష్ట్రంలో 600లకు పైగా అత్యాచారాలు జరిగాయని... వీటికి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. చట్ట రూపమే దాల్చని దిశ చట్టంతో ఏం ప్రయోజనమని ఎద్దేవా చేశారు. ప్రజలపై అప్పుడే రూ. 50 వేల కోట్లకు పైగా పన్నుల భారం మోపారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంత మందికి లబ్ధిని చేకూర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.