Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samantha tells how lock down helped her

  • సమంతకు లాక్ డౌన్ హెల్ప్ చేసిందట 
  • ఓటీటీ ద్వారా అల్లరి నరేశ్ సినిమా
  • 'శాకుంతలం'కు బాలీవుడ్ హీరోయిన్?  

*  లాక్ డౌన్ కారణంగా తనకు ఎంతో ఖాళీ సమయం దొరికిందని చెబుతోంది కథానాయిక సమంత. ''అవును, ఇంతకు ముందు క్షణం తీరిక దొరికేది కాదు.. లాక్ డౌన్ వల్ల వృత్తి పరంగా ఖాళీ దొరికింది. మనుషుల మధ్య బంధాలు పెంచుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది. ఈ కష్టకాలంలో ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం అన్నది నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది" అని చెప్పింది సమంత  
*  అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న 'నాంది' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. సతీశ్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం కొందరు ఓటీటీ ప్లేయర్స్ తో చర్చలు జరుగుతున్నాయట.
*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన తదుపరి చిత్రంగా 'శాకుంతలం' చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచీ ఇందులో ఫలానా హీరోయిన్ నటిస్తుందంటూ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం గుణశేఖర్ ట్రై చేస్తున్నారట.

Samantha
Allari Naresh
Gunashekhar
  • Loading...

More Telugu News