చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
- హైదరాబాదులో దాక్కున్నారని వ్యాఖ్యలు
- చంద్రబాబును ప్రవాసనేతగా అభివర్ణించిన కృష్ణప్రసాద్
- బాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడలేదని వెల్లడి
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆ అనుభవంతో చంద్రబాబు ఏం సాధించగలిగారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులకు, లోకేశ్ ను ఎమ్మెల్సీగా, మంత్రిగా చేసేందుకు మాత్రం ఆయన అనుభవం పనిచేసిందని ఎద్దేవా చేశారు. చూస్తుంటే చంద్రబాబు హైదరాబాదులో కూర్చుని విలీనం కోసం ఆలోచిస్తున్నట్టుగా ఉందని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.