Prabhas: 'ఆదిపురుష్'లో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్.. అధికారిక ప్రకటన!

  • నిన్న చెప్పినట్టుగానే ఈ ఉదయం అప్ డేట్ 
  • లంకేశ్ పాత్రలో విలన్ గా సైఫ్ అలీఖాన్
  • ఆసక్తితో ఎదురుచూస్తున్నానన్న ప్రభాస్
Saif Ali Khan as villian in Adipurush

ప్రభాస్ నటించే డైరెక్ట్ హిందీ చిత్రం 'ఆదిపురుష్'లో విలన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్నది వెల్లడైపోయింది. అందరూ ఊహించినట్టుగానే ఈ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని చిత్రం బృందం ఈ ఉదయం అధికారికంగా ప్రకటించింది.

'ఆదిపురుష్ గురించి రేపు ఉదయం 7.11 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వనున్నామంటూ' నిన్న చిత్ర కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ ప్రకటించిన సంగతి విదితమే. చెప్పినట్టుగానే ఈ ఉదయం అదే సమయానికి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ చిత్రంలో లంకేశ్ పాత్రలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్టు ఓ ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించింది. సైఫ్ అలీఖాన్ తో కలసి నటించడానికి ఎంతో ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నాననీ, అంతటి గొప్ప నటుడితో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా వుందని ఈ సందర్భంగా ప్రభాస్ పేర్కొన్నాడు.

ఇక హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని సుమారు 350 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. త్రీడీ ఫార్మాట్ లో ఇది తెరకెక్కుతుంది. రామాయణం ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.

More Telugu News