కారులో దొరికిన రూ. 5.22 కోట్లు నావే: జువెలరీ వ్యాపారి నల్లమల్లి బాలు
- ఏపీ, తమిళనాడు బోర్డర్ లో కారులో దొరికిన డబ్బు
- మంత్రి బాలినేని డబ్బు అంటూ ప్రచారం
- బంగారం కొనేందుకు తీసుకెళ్తున్నామన్న బాలు
ఈ నేపథ్యంలో ఒంగోలుకు చెందిన జువెలరీ వ్యాపారి నల్లమల్లి బాలు ఒక వీడియో విడుదల చేశారు. ఆ డబ్బు తమదేనని ఆయన చెప్పారు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా బంగారాన్ని కొనలేకపోయామని... అందుకే ఇప్పుడు కొనడానికి డబ్బును తీసుకెళ్తున్నామని చెప్పారు. అన్ని పత్రాలు చూపించి నగదును విడిపించుకుంటామని తెలిపారు.
ఈ వ్యవహారాన్ని ఒక రాజకీయపార్టీకి చెందిన నేతలతో ముడిపెట్టి మాట్లాడుతున్నారని... అందులో నిజం లేదని బాలు అన్నారు. ఏ పార్టీకి, ఏ నాయకుడికి దీంతో సంబంధం లేదని చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు. తన స్టిక్కర్ ను వాడుకోవడం చట్ట విరుద్ధమని... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.