పద్మాలయా సంస్థకు 50 ఏళ్లు... మహేశ్ బాబు స్పందన
- పద్మాలయా బ్యానర్ లో మరుపురాని చిత్రాలు చేసిన కృష్ణ
- తన సోదరులతో పద్మాలయా స్టూడియోస్ స్థాపించిన కృష్ణ
- 50 ఏళ్ల అద్భుత ప్రస్థానం అంటూ కొనియాడిన మహేశ్ బాబు
స్టూడియోస్ వ్యవస్థాపక సభ్యులు, ఈ బ్యానర్లో తిరుగులేని వినోదాత్మక చిత్రాలు అందించడంలో కృషి చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని, వారి పట్ల ఎంతో గౌరవం కలుగుతోందని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. పద్మాలయా బ్యానర్ లో వచ్చిన మొదటి చిత్రం అగ్నిపరీక్ష. 1970 జూలై 10న ఈ చిత్రం రిలీజైంది. ఈ బ్యానర్ లో కృష్ణ తన సోదరులైన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని హనుమంతరావులతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు.