YSRCP: సైనేడ్ పూసిన కత్తితో.. మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్య

Machilipatnam YSRCP leader murdered

  • వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య
  • హత్యలో పాల్గొన్న ఇద్దరు దుండగులు
  • పక్కా ప్రణాళికతోనే హత్య చేశారంటున్న కుటుంబసభ్యులు

కృష్ణాజిల్లాలో వైసీపీ నేత హత్య కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈరోజు చేపల మార్కెట్ కు వెళ్లిన భాస్కరరావును దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఆ కత్తికి సైనేడ్ పూయడంతో... ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆయన హత్యతో మచిలీపట్నం ఉలిక్కిపడింది. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

YSRCP
Leader
Murder
Machilipatnam
Bandar
Moka Bhaskar Rao
  • Loading...

More Telugu News