ఓ హై ఎండ్ కారులో వెళ్తున్న కుర్రాడిని ఆపి.. అతనితో గుంజీలు తీయించిన సెక్యూరిటీ !
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
- లాక్ డౌన్ సమయంలో ఎందుకు వచ్చావు? అని ప్రశ్నించిన సిబ్బంది
- కర్ఫ్యూ పాస్ ఉన్న సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ
లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రోడ్డుపైకి ఎందుకు వచ్చారని ఆ యువకుడిని ప్రశ్నించారు. కారులో నుంచి కిందకు దిగిన ఆ యువకుడు, తన వాహనానికి సంబంధించిన పేపర్లు వారికి చూపించి మాట్లాడాడు. అతని సమాధానానికి సంతృప్తి చెందని సిబ్బంది ఒకరు తన చేతిలో లాఠీ చూపిస్తూ గుంజీలు తీయమని ఆదేశించాడు. రెండు చేతులతో తన చెవులు పట్టుకున్న ఆ యువకుడు గుంజీలు తీయక తప్పలేదు. అనంతరం, కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా, ఆ యువకుడి తండ్రి పేరు డర్యాని. ఇండోర్ లోని ఆషా కన్ఫెక్షనరీ యజమాని. ఆ యువకుడితో సెక్యూరిటీ కౌన్సిల్ సిబ్బంది గుంజీలు తీయించడంపై అతని కుటుంబసభ్యులు మండిపడ్డారు. అతని వద్ద కర్ఫ్యూ పాస్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.