దుబాయ్ నుంచి వచ్చి.. 'కరోనా' నిబంధనలు పాటించని తెలంగాణ యువకుడిపై కేసు నమోదు
- నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్ కు చెందిన యువకుడు
- ఇటీవలే దుబాయ్ నుంచి రాక
- హోం క్వారంటైన్ పాటించకుండా ఇష్టానుసారం తిరిగాడు
- కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ కేసు నమోదు
అయితే, ఈ ఆదేశాలను బేఖాతరు చేసిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ నెల 13న దుబాయ్ నుంచి తన స్వగ్రామం వచ్చాడు. అయితే, సంబంధిత నిబంధనలు పాటించకుండా బయట గ్రామాలకు వెళ్లొస్తున్నాడు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో నవీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని కోటగిరి ఎస్ ఐ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ కేసు నమోదు చేశామని అన్నారు. బయట దేశాల నుంచి జిల్లాకు సుమారు మూడు వేల మంది వచ్చారని, వీరిలో ఎవరికి ‘కరోనా’ లక్షణాలు ఉన్నాయో తెలియవని, అందుకే, హోం క్వారంటైన్ లో ఉండాలని చెబుతున్నామని అన్నారు.