టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలి: పుల్లెల గోపీచంద్
- కరోనా విస్తరిస్తోందన్న గోపీచంద్
- క్రీడాకారులను ఒత్తిడికి గురిచేయరాదని వెల్లడి
- ఐఓసీ త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
"కరోనా ఎక్కడో ఉంది, మనకేం కాదులే అనుకోవడానికి లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాల్సిన సమయం ఇది. అందుకే క్రీడాకారులను ఒత్తిడికి గురిచేయకుండా ఐఓసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా యావత్ ప్రపంచం ఆలోచిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఒలింపిక్స్ ను వాయిదా వేయడమే మంచిదని భావిస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.