రజనీకాంత్ తీరే అంత.. మండిపడిన సీపీఐ నేత ముత్తరసన్
- ఆయన నిద్రపోడు.. ఇతరులను నిద్రపోనివ్వడు
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
- ఆ మాట పార్టీ ప్రకటన తర్వాత చెప్పి ఉండాల్సింది
తన వెంట సమర్థులైన నాయకులు లేరన్న కారణంతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి అవకాశం కల్పిస్తానని చెప్పడం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి వేర్వేరు నేతలన్న రజనీ.. ఆ ప్రకటనేదో పార్టీని ప్రకటించిన తర్వాత చేస్తే బాగుండేదని అన్నారు. రజనీకాంత్ నిద్రపోడని, ఇతరులనూ నిద్రపోనివ్వడని మండిపడ్డారు. బీజేపీ దేశంలో మతకలహాలను ప్రోత్సహిస్తోందని ముత్తరసన్ ఆరోపించారు.