యథార్థ సంఘటనల ఆధారంగా 'అమ్మ దీవెన' .. ట్రైలర్ రిలీజ్
- ఆమని ప్రధాన పాత్రగా 'అమ్మ దీవెన'
- కీలకమైన పాత్రలో సత్య ప్రకాశ్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఈ ట్రైలర్ లో లక్ష్మమ్మ అనే పాత్రలో ఆమని కనిపిస్తోంది. తాగుబోతు భర్త .. ఐదుగురు పిల్లలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు .. రాబందుల వంటి బంధువులు .. ఈ పరిస్థితులను ఆమె ఎలా అధిగమించింది? లక్ష్మమ్మ తరువాత ఆమె ఆశయాన్ని నెరవేర్చడానికి రంగంలోకి దిగింది ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ వలన అర్థమవుతోంది. పోసాని .. సత్య ప్రకాశ్ .. శరణ్య ప్రదీప్ ముఖ్యమైన పాత్రల్లో కనిపంచనున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.