తల్లిని చాకుతో పొడిచి చంపిన కూతురు... కర్ణాటకలో కలకలం!
- నిత్యమూ తల్లితో గొడవపడే అమృత
- ఆగ్రహంతో చాకుతో దాడి
- కేసును విచారిస్తున్న పోలీసులు
ఈ క్రమంలో తన తల్లితో నిత్యమూ గొడవలు పడుతూ ఉండే అమృత, ఆదివారం జరిగిన వాగ్వాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆపై నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోగా, అప్పటికే కోపంతో ఉన్న అమృత, ఓ చాకును తీసుకుని వెళ్లి, తల్లిని దారుణాతి దారుణంగా పొడిచి, హత్య చేసి పరారైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుమారుడు కూడా పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కేఆర్ పురం పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి కేసు నమోదు చేసి, అమృత కోసం గాలిస్తున్నారు.