చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ సర్కారు అమలు చేయాల్సిందే: నాగబాబు
- మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం
- రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతుల ఇబ్బందులు
- అమరావతిలో రాజధానిని యథాతథంగా కొనసాగించాలి
అమరావతిలో రాజధానిని యథాతథంగా కొనసాగించాలన్నదే జనసేన డిమాండ్ అని నాగబాబు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ సర్కారు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కష్టాల పరిష్కారం కోసం పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు.