నా క్షమాభిక్ష పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వండి: నిర్భయ నేరస్తుడు
- క్షమాభిక్ష పిటీషన్ పై తాను సంతకం చేయలేదన్నశర్మ
- త్వరలోనే నలుగురికి ఉరి శిక్ష అమలు
- అత్యాచార కేసుల క్షమాభిక్షలపై రాష్ట్రపతి విముఖత
అత్యాచార ఘటనలకు సంబంధించిన నేరస్తులకు క్షమాభిక్ష పెట్టకూడదని శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పడంతో, వినయ్ శర్మ పిటిషన్ ఉపసంహరణ వేడుకోలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులకు గాను ఒకరు మైనరు కావడంతో అతనికి జువైనల్ కోర్టు 3 సంవత్సరాల శిక్షను విధించింది. అతను శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యాడు. రామ్ సింగ్ అనే మరొక దోషి 2013లోనే జైలులో ఉరి వేసుకుని మరణించాడు. మిగిలిన నలుగురిని త్వరలోనే ఉరి తీయాల్సి ఉంది.