అక్కలు అఖిలప్రియ, మౌనికలపై కేసు పెట్టిన జగత్ విఖ్యాత్ రెడ్డి!
- హైదరాబాద్ లో భూ వివాదం
- భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలోనే భూమి అమ్మకం
- అప్పట్లో తాను మైనర్ నని, ఇప్పుడు వాటా కావాలని కోరుతున్న జగత్
కాగా, వీరి తండ్రి భూమా నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలోనే ఈ భూమి అమ్మకాలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ భూమిలో తనకు కూడా వాటా కావాలని డిమాండ్ చేస్తున్న జగత్ విఖ్యాత్ రెడ్డి, ఆ భూమిని విక్రయించిన సమయానికి తాను మైనర్ నని, తన వేలి ముద్ర చెల్లదని వాదిస్తున్నారు.
ఆ పత్రాలపై తనకు తెలియని వయసులో వేసిన వేలిముద్రలు ఎలా చెల్లుతాయని, ఇప్పుడు న్యాయంగా తనకు రావాల్సిన వాటాను ఇప్పించాలని ఆయన న్యాయమూర్తిని, తన పిటిషన్ లో అభ్యర్థించారు. ఇద్దరు అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఓ ప్రముఖ కుటుంబంలో ఇలా విభేదాలు పొడచూపడం, సొంత అక్కలపైనే తమ్ముడు కేసు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.