వందల కోట్ల రూపాయలతో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్యాకేజీ!
- వచ్చే నెల 31 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్
- అక్టోబరు 31 నుంచి పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి
- విద్యాహక్కు చట్టం అమలుకు కోట్లాది రూపాయల కేటాయింపు?
జమ్మూ కశ్మీర్లో ఓ ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర కార్మికశాఖ అందించింది. విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు కోట్లాది రూపాయలు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలను దగ్గర చేసేందుకు ఆధార్ చట్టం -2016 అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర చట్టాలను అక్కడ అమలు చేసే విషయంపైనా సమీక్షించారు. దీంతోపాటు వివిధ శాఖలు అందించిన ప్రతిపాదనలు అమలు చేసేందుకు ఎంతమొత్తం అవసరమవుతుందన్న దానిపై మదింపు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.