డాక్టర్ పై దాడి చేస్తే పదేళ్లు జైలుకే.. కొత్త చట్టం తీసుకురానున్న కేంద్రం!
- వైద్య సిబ్బందిపై దాడిచేస్తే 3-10 ఏళ్ల జైలుశిక్ష
- రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా
- వివరాలు ప్రకటించిన కేంద్ర మంత్రి హర్షవర్థన్
ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ.. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడే వారికి 3-10 సంవత్సరాల జైలుశిక్ష, రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించేలా చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. దీని ప్రకారం ఆసుపత్రిపై దాడికి పాల్పడి సామగ్రికి నష్టం కలిగిస్తే 6 నెలల నుంచి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని వెల్లడించారు.
ఈ మేరకు ముసాయిదా బిల్లును రూపొందించామనీ, త్వరలోనే దీనిపై అన్నివర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతామని పేర్కొన్నారు. ఓసారి ప్రజామోదం పొందాక దీన్ని కేబినెట్ ఆమోదిస్తుందనీ, ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.