modi: అహ్మదాబాద్ లో మోదీకి అపూర్వ స్వాగతం!

  • అహ్మదాబాద్ లో బీజేపీ విజయోత్సవ సభ
  • భారీ కాన్వాయ్, జన సందోహం మధ్య ఊరేగింపు
  • ‘మోదీ’ నినాదాలతో మార్మోగిన అహ్మదాబాద్ 

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత మోదీ తొలిసారిగా గుజరాత్ కు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో బీజేపీ విజయోత్సవ సభలో నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొనేందుకు వెళ్లారు. భారీ కాన్వాయ్, జన సందోహం మధ్య ఊరేగింపు కొనసాగింది. అహ్మదాబాద్ నగరం ‘మోదీ’ నినాదాలతో మార్మోగింది. అంతకుముందు, విమానాశ్రయంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోదీ, అమిత్ షాలతో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ పుష్ప నివాళులు అర్పించారు. విజయోత్సవ సభలో అమిత్ షా మాట్లాడుతూ, మోదీ ప్రధాని కావడంతో గుజరాత్ ప్రతిష్ట మరింత పెరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసించారు. బీజేపీ రెండు స్థానాల నుంచి 300 స్థానాలకు ఎదిగిన ప్రస్థానం గురించి ఆయన వ్యాఖ్యానించారు.

modi
amith shah
gujarath
pm
bjp
  • Error fetching data: Network response was not ok

More Telugu News