genelia: రీ ఎంట్రీకి సై అంటోన్న జెనీలియా

  • అల్లరి కథానాయిక జెనీలియా 
  • 'బొమ్మరిల్లు'తో విపరీతమైన క్రేజ్ 
  • మరాఠీ సినిమాతో రీ ఎంట్రీ    

తెలుగు తెరపై అందమైన కథానాయిక అనిపించుకున్నవాళ్లు చాలామందే వున్నారు. కానీ అల్లరి కథానాయిక అనిపించుకున్నది మాత్రం జెనీలియానే. 'బొమ్మరిల్లు' సినిమాతో జెనీలియా యూత్ హృదయాలను.. ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను ఏకమొత్తంగా  దోచేసింది. కళ్లతోనే మాట్లాడగలిగే కథానాయికగా పేరు తెచ్చుకున్న జెనీలియా, వివాహం తరువాత నటనకు దూరమైంది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా .. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టింది. ఇటీవలే 'మౌలి' అనే మరాఠీ సినిమాలో తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి ఒక సాంగ్ లో మెరిసింది. తన స్థాయికి తగిన సినిమాలు వస్తే దక్షిణాదిలోను సినిమాలు చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ ఆమె ఇటీవల ఒక స్టేజ్ పై చెప్పింది. దీనిని బట్టి జెనీలియా తెలుగు తెరపై మళ్లీ కనిపించే అవకాశాలు వున్నాయనే అనిపిస్తోంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News