ఏపీ మన్యంలో 3.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
- మన్యం ప్రాంతాన్ని వణికిస్తున్న చలిపులి
- లంబసింగిలో 3.2 డిగ్రీలు మాత్రమే
- మరింతగా పడిపోతుందని అధికారుల అంచనా
గత నెలలోనే రెండు సార్లు 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, గత శనివారం నాడు 7.5 డిగ్రీలు, ఆదివారం నాడు 6 డిగ్రీలకు తగ్గిన ఉష్ణోగ్రత, సోమవారం ఇంకా పడిపోయిందని చెప్పారు. డిసెంబర్ మొదటి వారాల్లో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేశారు. కాగా, చలి తీవ్రత అధికం కావడంతో పర్యాటకుల సంఖ్య పెరుగగా, పాఠశాల విద్యార్థులు, రోజువారీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.