రేపు విజయవాడ నుంచి తునికి.. పవన్ కల్యాణ్ రైలు ప్రయాణం!
- జన్మభూమి ఎక్స్ప్రెస్లో ప్రయాణం
- ప్రయాణంలో పార్టీ ఆశయాల వెల్లడి
- హాజరుకానున్న జనసేన కార్యకర్తలు
‘‘రేపు పవన్ కల్యాణ్ గారు విజయవాడ నుండి తునికి రైలులో ప్రయాణం చేయనున్నారు. దీనికి వివిధ రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి యాత్ర విజయవంతమవ్వాలని శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే ప్రతి జనసేన కార్యకర్త ఫ్లాట్ఫారం టికెట్ కొని వాటిని బ్యాడ్జీలుగా ధరించి, ప్రతి ఒక్కరం చట్టబద్ధంగా ప్లాట్ఫారంపైకి ప్రవేశించామని తెలియజేస్తూ.. చ---ట్టాలని, నియమాలను గౌరవించే బాధ్యత గల పౌరులమని నిరూపిద్దాం.
ఈ సందర్భంగా చట్టాలను అతిక్రమించి ఫ్లాట్ఫారం టికెట్ కొనకుండా ప్రవేశించారని కథనాలు ప్రసారం చేసే అవకాశం మీడియా మిత్రులకు ఇవ్వకూడదని విన్నపం. దేశంలో ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీ పాటించని ఈ క్రమశిక్షణ విధానాన్ని జనసేన పార్టీ తరుఫున మనం ప్రవేశపెడదాం. జనసేన మిత్రులందరూ ఈ అంశాన్ని పాటించగలరని మనవి’ అంటూ పాటించవలసిన సూచనలతో మరో లేఖను ట్విట్టర్లో జనసేన పోస్ట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు విజయవాడలో పవన్ జన్మభూమి ఎక్స్ప్రెస్లో బయల్దేరతారు. సాయంత్రం 5.20 నిమిషాలకు తుని రైల్వే స్టేషన్లో దిగుతారు.