నేడు కడపలో ధర్మపోరాట దీక్ష.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్!
- ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఏర్పాట్లు పూర్తి
- హాజరుకానున్న 2 లక్షల మంది
- మధ్యాహ్నం కడపకు వెళ్లనున్న ముఖ్యమంత్రి
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ లు హాజరుకానున్నారు. తొలుత ఈ నెల 20న ధర్మపోరాట దీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ వర్షం, మరికొన్ని అనివార్య కారణాలతో ఈరోజుకు కార్యక్రమం వాయిదా పడింది. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అనంతరం గండికోట ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరిస్తారు
ఆ తర్వాత మధ్యాహ్నం 1.35 గంటలకు ప్రొద్దుటూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఓవైపు ప్రతిపక్ష నేత జగన్ పై దాడి, మరోవైపు జిల్లాలో సీఎం చంద్రబాబును అడ్డుకుని తీరుతామని కమ్యూనిస్ట్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ స్థాయిలో, కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.