gautam: బ్రహ్మానందం కొడుకు సినిమాకి 115 మంది నిర్మాతలు

  • గౌతమ్ హీరోగా 'మను'
  • కథానాయికగా చాందిని 
  • సెప్టెంబర్ 7న విడుదల    

సాధారణంగా ఒక సినిమాను ఒకరు .. లేదంటే ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మిస్తూ వుంటారు. భారీ బడ్జెట్ అయితే ఒక్కోసారి నలుగురు నిర్మాతలు కలిసి సినిమాను నిర్మిస్తుంటారు. అలాంటిది ఒక సాధారణమైన సినిమాకే 115 మంది నిర్మాతలుగా మారడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అది హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు 'గౌతమ్' హీరోగా చేసిన 'మను' సినిమా విషయంలో జరిగింది.

చాందిని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా ఫణీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "ఈ కథను నమ్మిన వాళ్లంతా తమకి తోచిన స్థాయిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ల నమ్మకానికి ఎంత మాత్రం తగ్గకుండగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను" అన్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. సన్నివేశాలు .. సంభాషణలు చాలా నేచురల్ గా అనిపిస్తున్నాయి. ఈ సినిమాలో గౌతమ్ పోషించిన పాత్ర కొత్తగా వుంటుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News