రూ. 6 కోట్లు చిట్టీల సొమ్ము మింగేసిన కేసులో.. మీనా జ్యూవెల్లర్స్ యజమాని అరెస్ట్
- చిట్టీల సొమ్మును స్వాహా చేసిన ఉమేష్ పురుషోత్తమ్
- చెల్లని చెక్కులు ఇచ్చి మోసం
- కావాలనే ఎగ్గొడుతున్నాడని తేల్చిన పోలీసులు
అతని కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్ చేశామని, శుభాంజలి చిట్స్ లో నాలుగేళ్ల కిందట ఉమేష్ సభ్యుడిగా చేరి, ఏడాది వ్యవధిలోనే రూ. కోటి విలువైన ఐదు చిట్టీలు, రూ. 50 లక్షల విలువైన రెండు చిట్టీల్లో చేరి, ఆ వెంటనే వాటిని పాడుకున్నాడని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఆపై నెలసరి వాయిదాలను ఎగ్గొట్టారని, చిట్ ఫండ్ సంస్థ ప్రతినిధులు నిలదీయగా, చెల్లని చెక్కులు ఇచ్చారని తెలిపారు. అరెస్ట్ చేసిన పురుషోత్తమ్ ను కోర్టు ముందు హాజరు పరుస్తామని, కేసును విచారిస్తున్నామని వెల్లడించారు.