Mahesh Babu: అభిమానులకు ప్రముఖ సినీ తారల ఉగాది శుభాకాంక్షలు...ఎవరేమన్నారంటే....!

  • అభిమానులకు ట్విట్టర్ వేదికగా హీరో నాగార్జున, మహేశ్, ఎన్‌టీఆర్ విషెస్
  • హీరోయిన్లు సమంత, కాజల్, సిమ్రన్ కూడా
  • ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర వేడుకలు

శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా సినీ తారలు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కొత్త ధైర్యం, కొత్త ఆశ, కొత్త ప్రారంభాలతో కొనసాగాలని సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. "నిజాయతీతో మీరు కోరుకున్నది ఈ తెలుగు నూతన సంవత్సరం సాధించిపెట్టాలి" అని ఆయన ఆకాంక్షించారు.

"ఈ ఏడాది మీరు కోరుకున్నది దక్కాలని కోరుకుంటున్నా" అంటూ అక్కినేని నాగార్జున విషెస్ చెప్పారు. "మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు" అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

"మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషకరమైన ఉగాది శుభాకాంక్షలు" అని టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఆకాంక్షించింది. అలాగే అల్లరి నరేశ్, సుధీర్ బాబు, సుశాంత్ కూడా అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రన్ కూడా అభిమానులకు ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. "మామిడి ముక్కలు, వేప, బెల్లం అనేవి జీవితంలోని పులుపు, చేదు, తీపి రుచులను తెలుపుతాయి. ఈ ఉగాది రుచులు రానున్న ఏడాదిలో మీ జీవితంలో నిండాలని కోరుకుంటున్నా" అని సిమ్రన్ ఆకాంక్షించారు.

Mahesh Babu
Simran
Sudheer babu
Samantha
NTR
  • Error fetching data: Network response was not ok

More Telugu News