తాజ్ మహల్ వద్ద శివుడి పూజ చేసిన యువకులు.. ఉద్రిక్తత!
- శివుడుని కీర్తిస్తూ పాటలు
- తాజ్ కింద ఉన్నది శివాలయమే అంటూ వాదన
- అరెస్ట్, విడుదల
దీపక్ శర్మ అనే వ్యక్తి నేతృత్వంలో కొందరు యువకులు టూరిస్టుల మాదిరి తాజ్ సందర్శనకు వచ్చారు. లోపలకు వచ్చిన తర్వాత కింద కూర్చొని శివుడి పారాయణం మొదలుపెట్టారు. వీరందరినీ రాష్ట్రీయ స్వాభిమాన్, హిందూ యువవాహిని కార్యకర్తలుగా గుర్తించారు. అనంతరం వీరిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. అయితే, యువకులు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి క్షమాపణ చెప్పడంతో, వారిని వదిలిపెట్టారు.