విజయ్ దేవరకొండ తరువాత శర్వానంద్ తోనేనట!
యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి అందరిలోను మొదలైంది. ఈ క్రమంలో శర్వానంద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'అర్జున్ రెడ్డి' కి వచ్చిన సక్సెస్ టాక్ చూసిన శర్వానంద్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడట. దాంతో ఆయన హీరోగా తన సొంత బ్యానర్లో మరో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడని అంటున్నారు.