రొమాంటిక్ హీరోగా మారుతోన్న టాప్ కమెడియన్!
అలాంటి శ్రీనివాస రెడ్డి త్వరలో రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు జె.బి.మను ఓ రొమాంటిక్ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆయన శ్రీనివాస రెడ్డిని తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా గోపీసుందర్ ను ఎంపిక చేసుకున్నాడు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోందనీ .. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నామని దర్శకుడు చెప్పాడు.