కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నావ్... ఏమైంది జగన్: మంత్రి లోకేశ్ సెటైర్లు

- శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మాట్లాడిన మంత్రి
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటూ జగన్ ఊదరగొట్టారని, చివరికి ఏమైందంటూ ఎద్దేవా
- తాము రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ముందే చెప్పామన్న లోకేశ్
ఈరోజు బడ్జెట్ సమావేశాలలో భాగంగా గవర్నర్ ప్రసంగానికి శాసనమండలిలో ధన్యవాదాలు తెలిపే క్రమంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సెటైర్లు వేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటూ ఊదరగొట్టారని, చివరికి ఏమైందని ఎద్దేవా చేశారు.
ఇక గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని ముందే ఎలా చెబుతారంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దానికి మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ... రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి రూ. 13 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు.
పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడం లేదన్న మంత్రి.. కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో తప్పేముందని పేర్కొన్నారు. పరిశ్రమలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ఇక ఐదేళ్ల వైసీపీ పాలన చూసి, తాము ముందే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఇక గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని ముందే ఎలా చెబుతారంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దానికి మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ... రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి రూ. 13 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు.
పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడం లేదన్న మంత్రి.. కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో తప్పేముందని పేర్కొన్నారు. పరిశ్రమలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ఇక ఐదేళ్ల వైసీపీ పాలన చూసి, తాము ముందే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.