First Step Rebuilding AP

తెలంగాణలో కొత్తగా 174 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 174 కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 38,442 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,096 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,442 కరోనా పరీక్షలు నిర్వహించగా, 174 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 65 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిజామాబాద్, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 202 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,71,174 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,124 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,096 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,954కి పెరిగింది.


More Telugu News