తెలంగాణలో క‌రోనా కేసుల తాజా వివరాలు

  • కొత్త‌గా 5,892 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640
  • మృతుల సంఖ్య 2,625
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,104 మందికి క‌రోనా
తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 5,892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 9,122 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,05,164 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,625గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73,851 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,104 మందికి క‌రోనా సోకింది.  
  


More Telugu News