Chandrababu Naidu: మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పుస్తకావిష్కరణకు హాజరైన సీఎం చంద్రబాబు

- మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రచించిన డాక్టర్ శరణి
- విజయవాడలో పుస్తకావిష్కరణ
- పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీ చిరంజీవికి అందించిన చంద్రబాబు
ఏపీ మంత్రి నారాయణ కుమార్తె, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు డాక్టర్ శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు... తొలి కాపీని చిరంజీవికి అందించారు. అనంతరం, రచయిత డాక్టర్ శరణికి, మంత్రి నారాయణకు, గంటా శ్రీనివాసరావుకు కూడా కాపీలు అందించారు. అంతకుముందు, వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమం విజయవాడ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగింది.