Rajnath Singh: ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

- ఈ నెల 22న జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి
- పహల్గామ్ లో కాల్పులు... 26 మంది మృతి
- నేడు ఢిల్లీలో కీలక సమావేశం
- అఖిలపక్షానికి హాజరైన కేంద్రమంత్రులు... రాహుల్, ఖర్గే
పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, నేడు దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జై శంకర్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో... పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తీరుతెన్నులు, కేంద్రం తీసుకున్న చర్యలను రాజ్ నాథ్ సింగ్ వివరించనున్నారు. ఉగ్రదాడులను ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో సలహాలను కోరనున్నారు.